వర్చ్వల్ లోక్అదాలత్లో ఆరు కేసులు పరిష్కారం
ABN , First Publish Date - 2021-01-24T06:16:46+05:30 IST
స్థానిక ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ కోర్డులో శనివారం నిర్వహించిన వర్చ్వల్ లోక్అదాలత్లో న్యాయమూర్తి డాక్టర్ కె.శారద ఆరు కేసులు పరిష్కరించారు.
పాడేరు, జనవరి 23: స్థానిక ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ కోర్డులో శనివారం నిర్వహించిన వర్చ్వల్ లోక్అదాలత్లో న్యాయమూర్తి డాక్టర్ కె.శారద ఆరు కేసులు పరిష్కరించారు. ఆరు క్రిమినల్ కేసుల్లో రెండు కేసులు రాజీ కాగా, మిగిలిన నాలుగు కేసుల్లో నేరం అంగీకరించడంతో ముద్దాయిలకు రూ.7,500 జరిమానా విధించారు. ఈకార్యక్రమంలో ఏపీపీ వి.రమేశ్, అదాలత్ సభ్యులైన న్యాయవాదులు టి.ప్రసాదరావునాయుడు, యు.సింహాచలం, జి.వెంకటరమణ, కోర్టు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.