రూ.4 కోట్లతో శింగరకొండ ఆలయ అభివృద్ధి
ABN , First Publish Date - 2021-01-16T05:26:32+05:30 IST
శింగరకొండ ప్రసన్నాంజనే యస్వామి దేవాలయాన్ని రూ.4కోట్లతో అభివృద్ధి చే యనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా ప్రసన్నాంజ నేయస్వామి దేవాలయానికి టీటీడీ తరుపున గురు వారం ఆయన గోవును అందజేశారు.
టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి
అద్దంకి, జనవరి 15: శింగరకొండ ప్రసన్నాంజనే యస్వామి దేవాలయాన్ని రూ.4కోట్లతో అభివృద్ధి చే యనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా ప్రసన్నాంజ నేయస్వామి దేవాలయానికి టీటీడీ తరుపున గురు వారం ఆయన గోవును అందజేశారు. ఈ సందర్భం గా నిర్వహించిన గోపూజలో వైవీ.సుబ్బారెడ్డి దంపతు లు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వైవీ, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జి బాచిన కృష్ణ చైతన్యలను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివా సరెడ్డి, వేదపండితులు హరిశంకరావధాని, పూజారు లు ఘనంగా సత్కరించి, ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దే వాలయం ముఖ మండపం అభివృద్ధికి అవసరమైన రూ.4కోట్లను టీటీడీ ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమ ంలో వైసీపీ నాయకులు కోట శ్రీనివాసకుమార్, కా కాని రాధాకృష్ణమూర్తి, ఓరుగంటి కోటిరెడ్డి, ఈదా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.0