సిలిగురి-ఢాకా రైలు సర్వీసు మార్చి26న ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-25T13:41:16+05:30 IST
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మార్చి 26వతేదీ నుంచి సిలిగురి జిల్లా న్యూజల్పాయ్గురి నుంచి బంగ్లాదేశ్ లోని ఢాకా రైల్వేస్టేషన్ వరకు మూడో ప్యాసింజరు రైలు...
సిలిగురి (పశ్చిమబెంగాల్): బంగ్లాదేశ్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మార్చి 26వతేదీ నుంచి సిలిగురి జిల్లా న్యూజల్పాయ్గురి నుంచి బంగ్లాదేశ్ లోని ఢాకా రైల్వేస్టేషన్ వరకు మూడో ప్యాసింజరు రైలు నడపాలని భారత్, బంగ్లాదేశ్లు నిర్ణయించాయి. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ఇప్పటికే మైత్రీ ఎక్స్ప్రెస్, బంధన్ ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి.వచ్చే నెల 26వతేదీన భారత్, బంగ్లాదేశ్ ల ప్రధానమంత్రులు న్యూజల్పాయ్గురి నుంచి బంగ్లాదేశ్ లోని ఢాకా వరకు ప్యాసింజరు రైలును ప్రారంభిస్తారని రైల్వే అధికారులు చెప్పారు.
బంగ్లాదేశ్ రైల్వే డీఆర్ఎం ముహమ్మద్ షాహిదుల్ ఇస్లాం నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం ఫిబ్రవరి 21వతేదీన సిలిగురికి వచ్చి భారత రైల్వే డీఆర్ఎం రబీందర్ కుమార్ వర్మతో కలిసి చర్చించారు. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య మూడో రైలును ప్రారంభించాలని నిర్ణయించారు.పది బోగీలతో కూడిన బై వీక్లీ ట్రైన్ సర్వీసు న్యూజల్పాయ్ గురి నుంచి ఢాకాకు నడుపుతామని డీఆర్ఎం రబీందర్ కుమార్ చెప్పారు.ఈ రైలు సర్వీసుతో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య మైత్రీబందం మరింత బలోపేతం కానుంది.