సిద్ధరామయ్య ఆరోగ్యంపై స్పందించిన మణిపాల్ ఆస్పత్రి

ABN , First Publish Date - 2020-08-05T20:54:26+05:30 IST

కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆస్పత్రి యాజమాన్యం...

సిద్ధరామయ్య ఆరోగ్యంపై స్పందించిన మణిపాల్ ఆస్పత్రి

బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు మణిపాల్ ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం ఆయనకు జ్వరంలేదని ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల కరోనా బారినపడిన సిద్ధరామయ్య బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ‘‘ప్రస్తుతం ఆయనకు జ్వరం లేదు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్పత్రిలో చేరినప్పటికంటే ఇప్పుడు ఆయన పరిస్థితిలో చాలా మెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు..’’ అని ఆస్పత్రి పేర్కొంది. సిద్ధరామయ్యకు సరైన చికిత్స అందిస్తున్నామనీ... వైద్య నిపుణులతో నిత్యం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. 71 ఏళ్ల సిద్ధరామయ్య ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. సోమవారం ఉదయం ఆయనకు జ్వరం రావడంతో అదే రోజు సాయంత్రం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. 

Updated Date - 2020-08-05T20:54:26+05:30 IST