కనకమహాలక్ష్మికి ఫలంకరణ
ABN , First Publish Date - 2022-08-13T05:27:57+05:30 IST
జిల్లావ్యాప్తంగా శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. మూడో శుక్రవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని ఫలాలతో అలంకరించారు. చీపురుపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారిని ద
చీపురుపల్లి, ఆగస్టు 12: జిల్లావ్యాప్తంగా శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. మూడో శుక్రవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని ఫలాలతో అలంకరించారు. చీపురుపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి సూర్య ప్రకాశ్, వైస్ చైర్మెన్ సూరు వెంకటకుమార్, ఈవో జి.శ్రీనివాస్, అర్చకులు ఆరవెల్లి శ్రీనివాసరావు, రవికుమార్, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.