మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-03T05:43:11+05:30 IST

మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి

మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి
వికారాబాద్‌లో గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌, అధికారులు

వికారాబాద్‌, అక్టోబరు 2: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సత్యాగ్రహమే ఆయుధంగా శాంతి, అహింసా మార్గాల్లో దేశానికి స్వాతం త్య్రం సాధించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. ప్రతీ ఒక్కరం ఆయన చూపిన మార్గంలో పయనించి సమాజా భివృద్ధికి పాటుపడాలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో ఎస్టీ వెల్ఫేర్‌ అధికారి కోటాజీ, కలెక్టర్‌ కార్యాలయ ఏవో అమరేందర్‌రెడ్డి, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


  • మహాత్ముని ఆశయాలు ఆచరణీయం

మేడ్చల్‌ అర్బన్‌: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు అందరికీ ఆచరణీయం అని జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌ అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. యూత్‌ వెల్ఫేర్‌ అధికారి బలరామ్‌రావు, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:43:11+05:30 IST