కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్‌

ABN , First Publish Date - 2021-05-05T05:31:48+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్‌

కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్‌
వ్యాపారులతో మాట్లాడుతున్న డీఎస్పీ, కమిషనర్‌

హిందూపురం టౌన, మే 4: కొవిడ్‌ కట్టడి చేసేందుకు బుధవారం నుంచి హిందూపురంలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు 6గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని రెండు వారాలపాటు నిబంధనలు అమలులో ఉంటాయని డీఎస్పీ మహబూబ్‌బాష, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణంలోని వర్తక,వ్యాపార సంఘం ప్రతినిధులతో కర్ఫ్యూపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 144 సెక్షన అమలులో ఉంటుందన్నారు. నిత్యవసర సరుకులు తీసుకెళ్లేవారు, ఇతర పనులు ఉంటే 12 గంటలలోపే చూసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలెవరూ బయటికు రాకూడదన్నారు. షాపుల వద్ద నోమాస్క్‌ నో ఎంట్రీ బోర్డులను పెట్టడంతో భౌతిక దూరం పాటించేలా బాక్సులు వేయాలన్నారు. షాపులవద్ద నలుగురికి మించి ఉండరాదన్నారు. అలా ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్‌చేసి అనుమతులు రద్దు చేస్తామన్నారు. కర్ఫ్యూ సమయంలో ఎవరుకూడా ఇళ్ల నుంచి బయటికి రాకూడదని అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎవరైనా రోడ్డుమీదకు వస్తే వారిపై కొవిడ్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. వీరికి పట్టణంలోని వ్యాపారులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టూటౌన సీఐ మన్సూరుద్దీన, వర్తక వ్యాపార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-05T05:31:48+05:30 IST