కశ్మీర్లో బిహారీ వలస కార్మికుడి కాల్చివేత
ABN , First Publish Date - 2022-08-13T08:53:42+05:30 IST
జమ్మూ కశ్మీర్లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల చేతిలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం బండిపోర జిల్లాలో
ఐదు నెలల్లో ఉగ్రవాదులకు తొమ్మిది మంది బలి
శ్రీనగర్, ఆగస్టు 12: జమ్మూ కశ్మీర్లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల చేతిలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం బండిపోర జిల్లాలో వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. బిహర్కు చెందిన కార్మికుడు ముహమ్మద్ అమ్రె జ్(19) ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. ఇదే తరహాలో ఈ నెల 4, 5 తేదీల్లో ఇద్దరు బిహారీ వలస కార్మికులను ఉగ్రవాదులు చంపేశారు. అలాగే, గత ఐదు నెలల్లో తొమ్మిది మంది పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.