నివ్వెరపోతున్న టీఎంసీ కార్యకర్తలు.. మమతపై మరింత ఆధిక్యంలో సువేంధు అధికారి..
ABN , First Publish Date - 2021-05-02T16:16:53+05:30 IST
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. క్షణక్షణానికి మెజార్టీలు మారిపోతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో అయితే అభ్యర్థులనే కాకుండా, ఆయా పార్టీల అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. క్షణక్షణానికి మెజార్టీలు మారిపోతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో అయితే అభ్యర్థులనే కాకుండా, ఆయా పార్టీల అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికలకు ముందు తన పార్టీ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేత సువేంధు అధికారిని ఓడించి తీరాలన్న పంతంతో ఆమె నందిగ్రామ్ నుంచే పోటీ చేయాలని ఫిక్సయ్యారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేంధు అధికారి లీడింగ్ లో ఉన్నారు. ఆయనకు 15623 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో మమతా బెనర్జీ ఉన్నారు. ఆమెకు 10895 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి మధ్య 4728 ఓట్ల తేడా ఉంది.