బీజేపీకి గుడ్‌బై చెప్పిన మరో మిత్రపక్షం

ABN , First Publish Date - 2021-02-28T06:31:09+05:30 IST

దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో అస్సాం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్.. బీజేపీకి గుడ్‌బై చెప్పేసింది.

బీజేపీకి గుడ్‌బై చెప్పిన మరో మిత్రపక్షం

దిస్పూర్: దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో అస్సాం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్.. బీజేపీకి గుడ్‌బై చెప్పేసింది. తాము కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ‘‘శాంతి, ఐక్యత, అభివృద్ధి సాధన కోసం అలాగే అస్సాంలో అవినీతి రహితమైన స్థిరమైన ప్రభుత్వం కోసం మహాజాథ్‌తో కలిసి బీపీఎఫ్ పోటీ చేస్తుంది’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు హగ్రామ మోహిలరీ ప్రకటించాడు. ఈ సందర్భంగా బీజేపీతో తాము తెగతెంపులు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-28T06:31:09+05:30 IST