రోడ్డు ప్రమాదంలో కాపరి, గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2021-06-14T06:06:29+05:30 IST

మండలంలోని ఆర్‌కొత్తపల్లి సమీపంలోని మనుకొండ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో కాపరి, 15 గొర్రెలు మృతిచెందాయి.

రోడ్డు ప్రమాదంలో కాపరి, గొర్రెలు మృతి
గొర్రెల కాపరి పోతన్న మృతదేహం



రామగిరి, జూన్‌ 13: మండలంలోని ఆర్‌కొత్తపల్లి సమీపంలోని మనుకొండ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో కాపరి, 15 గొర్రెలు మృతిచెందాయి. నసనకోట గ్రామానికి చెందిన కాపరి బోయ పోతన్న (48) గొర్రెలను తోలుకుని వెళ్తుండగా అదే ఊరికి చెందిన రామలింగారెడ్డి సుమో వాహనంలో వస్తూ అదుపు తప్పి, కాపరితోపాటు, గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. కాపరి పోతన్నతోపాటు 15 గొర్రెలు మృతిచెందాయి. పోతన్న గొర్రెలను ఈత వేసేందుకు తెల్లవారుజామునే వెళ్తుండగా.. రామలింగారెడ్డి కుమార్తె కోసం సమోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే పోతన్న భార్య చిన్నక్క, కుమార్తెలు ముత్యాలమ్మ, త్రిష, బంధువులు, అక్కడికి చేరుకుని, కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ నాగాస్వామి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-06-14T06:06:29+05:30 IST