రోడ్డు ఎత్తు పెంచడమే ప్రమాదానికి కారణం: Shashikala

ABN , First Publish Date - 2022-04-29T14:56:26+05:30 IST

కలిమేడు ప్రమాదానికి రోడ్డు ఎత్తు పెంచడమే కారణమని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ పేర్కొన్నారు. తంజావూరు సమీపం కళిమేడులో బుధవారం

రోడ్డు ఎత్తు పెంచడమే ప్రమాదానికి కారణం: Shashikala

పెరంబూర్‌(చెన్నై): కలిమేడు ప్రమాదానికి రోడ్డు ఎత్తు పెంచడమే కారణమని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ పేర్కొన్నారు. తంజావూరు సమీపం కళిమేడులో బుధవారం జరిగిన ఆలయ రథోత్సవంలో అపశృతి చోటుచేసుకొని 11 మంది మృతిచెందగా, మరో 17 మంది గాయాలతో తంజావూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం ఆస్పత్రికి వెళ్లిన శశికళ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ, కలిమేడు గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ చేపట్టిన సమయంలో రోడ్డు ఎత్తు ఒకటిన్నర అడుగుకు పెంచారని, అందువల్ల హై ఓల్టేజీ విద్యుత్‌ తీగ రథానికి తగిలి విపత్తు చోటుచేసుకుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-04-29T14:56:26+05:30 IST