చాముండేశ్వరి దేవిని దర్శించుకున్న Shashikala
ABN , First Publish Date - 2022-03-13T17:27:58+05:30 IST
తమిళనాడుకు చెందిన మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు, అన్నా డీఎంకే మాజీ నేత శశికళ మైసూరును సందర్శించారు. శనివారం ఉదయం బంధువులతో పాటు సన్నిహితులతో కలిసి మైసూరు చాముండేశ్వరీ
బెంగళూరు: తమిళనాడుకు చెందిన మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు, అన్నా డీఎంకే మాజీ నేత శశికళ మైసూరును సందర్శించారు. శనివారం ఉదయం బంధువులతో పాటు సన్నిహితులతో కలిసి మైసూరు చాముండేశ్వరీ దేవిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. పరప్పన జైలులో విలాసవంతమైన జీవనం సాగించారనే కోర్టులో దాఖలైన కేసు విచారణలకై శశికళ శుక్రవారం బెంగళూరుకు వచ్చారు. ఆమెతో పాటు ఇళవరసి మరో ఇరువురు జైలు అధికారులకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈమేరకు శుక్రవారం రాత్రి శ్రీరంగపట్నంకు చేరుకుని ఆలయాల సందర్శన చేశారు. మైసూరు చాముండేశ్వరీ కొండపైకి చేరుకోగానే అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఏ రాజకీయ పార్టీలోను క్రియాశీలకంగా లేరు.