సీఎం కేసీఆర్కు బహిరంగ సవాల్ విసిరిన షర్మిల...
ABN , First Publish Date - 2022-03-12T16:11:17+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
నల్గొండ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ బడ్జెట్ గోల్మాల్ గోవిందమంటూ ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా, కొండపాక గూడెం నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించిన షర్మిల సీఎం కేసీఆర్కు బహిరంగ సవాల్ విసిరారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తనతోపాటు పాదయాత్రకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి సమస్యలు లేకుంటే తాను ముక్కును నేలకు రాసి వెళ్లిపోతానని.. సమస్యలు ఉంటే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? అని షర్మిల సవాల్ చేశారు.