విద్యార్థులతో మట్టి పనులు

ABN , First Publish Date - 2021-04-17T05:54:45+05:30 IST

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 16: ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామంలో ఎంపీయూపీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో మట్టి పనులు చేయించారు. ఇ

విద్యార్థులతో మట్టి పనులు
శరభవరం పాఠశాలలో మట్టిపనులు చేస్తున్న విద్యార్థులు

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 16: ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామంలో ఎంపీయూపీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో మట్టి పనులు చేయించారు. ఇటువంటి పనులు చేయించడం విద్యార్థుల స్వేచ్ఛ, గౌరవాలకు భంగకరమని విద్యాహక్కు చట్టం చెబుతున్నా ఈ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై మండల విద్యాశాఖాధికారి వి.రాజబాబు సంబంధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీర్రాజును ఆరా తీయగా పాఠశాలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్‌ వినియోగంలోకి తీసుకురావడానికి విద్యార్థులతో పాటు తాము పని చేసి మట్టిని తొలగించామని హెచ్‌ఎం చెప్పినట్టు ఎంఈవో తెలిపారు.

Updated Date - 2021-04-17T05:54:45+05:30 IST