ఎన్నార్సీతో గూర్ఖాలకు అన్యాయం జరగదు: షా

ABN , First Publish Date - 2021-04-13T07:52:17+05:30 IST

ఎన్నార్సీ వల్ల ఒక్క గూర్ఖాకు కూడా అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఆయన సోమవారం రోడ్‌షో నిర్వహించారు.

ఎన్నార్సీతో గూర్ఖాలకు అన్యాయం జరగదు: షా

కాలింపాంగ్‌, ఏప్రిల్‌ 12: ఎన్నార్సీ వల్ల ఒక్క గూర్ఖాకు కూడా అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఆయన సోమవారం రోడ్‌షో నిర్వహించారు. ఎన్నార్సీ అమలైతే గుర్ఖాలను దేశం నుంచి తరిమేస్తామంటూ  టీఎంసీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. డార్జిలింగ్‌, కాలింపాంగ్‌ల్లో గూర్ఖాల మృతికి బెంగాల్‌ సీఎం మమత కారణమన్నారు. ఆయన.. జై శ్రీరాం.. జై గూర్ఖా అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2021-04-13T07:52:17+05:30 IST