మురుగు నిర్వహణ జీహెచ్‌ఎంసీకే

ABN , First Publish Date - 2020-10-01T09:15:03+05:30 IST

గ్రేటర్‌ శివారు సర్కిళ్లలోని సివరేజీ నిర్వహణ బాధ్యత తిరిగి జీహెచ్‌ఎంసీకే అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వు లు జారీ చేశారు.

మురుగు నిర్వహణ జీహెచ్‌ఎంసీకే

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ శివారు సర్కిళ్లలోని సివరేజీ నిర్వహణ బాధ్యత తిరిగి జీహెచ్‌ఎంసీకే అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వు లు జారీ చేశారు.వాటర్‌ బోర్డుకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది.


ఈ విషయాన్ని పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ సభ్యులు ప్రస్తావించారు. దీంతో పురపాలకశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-10-01T09:15:03+05:30 IST