గ్రామ సచివాలయంలో మందు పార్టీ

ABN , First Publish Date - 2020-08-02T15:35:49+05:30 IST

తిరుపతి సమీపంలోని శెట్టిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని..

గ్రామ సచివాలయంలో మందు పార్టీ

ఆలస్యంగా వెలుగులోకి..

ఇద్దరు వలంటీర్లను తొలగించిన అధికారులు


తిరుపతి(చిత్తూరు): తిరుపతి సమీపంలోని శెట్టిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని బీటీఆర్‌ కాలనీ (మంగళం వద్ద) గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వలంటీర్లు రెడ్డెప్ప, ఢిల్లీబాబు గత నెల 29వ తేదీన సచివాలయలో మందు పార్టీ పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు వెళ్లి ఇదేం పనంటూ ప్రశ్నించారు. మరికొందరు ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీసి.. వైరల్‌ చేశారు. ఈ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ జరిపించారు. అనంతరం ఆ ఇద్దరు వలంటీర్లను విఽధుల నుంచి పూర్తిగా తొలగించినట్లు పంచాయతీ కార్యదర్శి సురేంద్రరావు శనివారం మీడియాకు తెలిపారు.


Updated Date - 2020-08-02T15:35:49+05:30 IST