శెట్టిబలిజల ఐక్యతకు కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-03-08T05:45:05+05:30 IST

శెట్టిబలిజ సంఘీ యుల ఐక్యతకు కృషిచేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడిపూడి సూర్యనారాయణరావు పిలుపుని చ్చారు.

శెట్టిబలిజల ఐక్యతకు కృషిచేయాలి

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 7: శెట్టిబలిజ సంఘీ యుల ఐక్యతకు కృషిచేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడిపూడి సూర్యనారాయణరావు పిలుపుని చ్చారు. స్థానిక గేదేల నూక రాజు కళ్యాణ మండపంలో ఆదివారం శెట్టిబలిజ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శెట్టిబలిజ వధూవరుల పరిచయ వేదికకు ఆయన ముఖ్యఅతి థిగా విచ్చేసి మాట్లాడారు. శెట్టిబలిజల సంక్షేమానికి అందరిని చైతన్యవంతం చేసి ముందుకు సాగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. అనంతరం రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో శెట్టిబలిజ కులస్థుల సంక్షేమం తోపాటు తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా పరిచయ వేదికలను ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు, కట్టా మల్లేశ్వరరావు, కముజు కుమార్‌, ఇళ్ళ శివప్రసాద్‌, నాయకులు నెల్లి సర్వేశ్వర రావు, కడలి వెంకటేశ్వరావు, గేడి రాజు, కడవల అప్పలస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:45:05+05:30 IST