ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2020-08-12T10:50:08+05:30 IST
జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంబేటి ఏసయ్య జిల్లా కలెక్టరు చక్రధర్బాబును కోరారు.
నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 11 : జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంబేటి ఏసయ్య జిల్లా కలెక్టరు చక్రధర్బాబును కోరారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ను కలిశారు. జిల్లాలో వర్షాలు పడుతున్న దృష్ట్యా దళారులు ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని, కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని కోరారు. నెల్లూరులోని కూరగాయల మార్కెట్ పునఃప్రారంభంపై చర్చించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఏసయ్య తెలిపారు.