సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-02-26T04:00:59+05:30 IST
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, స్టాండింగ్ ఆర్డర్స్ను రద్దు చేసి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని ఎస్ఈ కార్యాలయం ఎదుట రిలేదీక్ష చేపట్టారు. గురువారం విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏసీసీ, పిబ్రవరి 25: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, స్టాండింగ్ ఆర్డర్స్ను రద్దు చేసి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని ఎస్ఈ కార్యాలయం ఎదుట రిలేదీక్ష చేపట్టారు. గురువారం విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐక్యవేదిక నాయకులు సదానందం, నగేష్ మాట్లాడుతూ ఒక సంస్థలో ఒకే విధమైన సర్వీసు రూల్స్ ఉండాలని, ఆర్టిజన్స్ కార్మికుల సర్వీసును 4.12.2016 నుంచి పరిగణ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేష్, రాంచందర్ పాల్గొన్నారు.