ఏడో అంతస్థు నుంచి దూకి చనిపోయిన మోడల్.. ఆమె మరణం వెనుక సంచలన నిజాలు.. మంత్రి పేరు తెర మీదకు రావడంతో..

ABN , First Publish Date - 2022-02-02T18:10:57+05:30 IST

ఆమె ఒక మోడల్.. గత ఆదివారం తను ఉంటున్న హోటల్ ఏడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది..

ఏడో అంతస్థు నుంచి దూకి చనిపోయిన మోడల్.. ఆమె మరణం వెనుక సంచలన నిజాలు.. మంత్రి పేరు తెర మీదకు రావడంతో..

ఆమె ఒక మోడల్.. గత ఆదివారం తను ఉంటున్న హోటల్ ఏడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.. తాజాగా ఆమె ఆత్మహత్య వెనకున్న సంచలన నిజాలను వెల్లడించారు.. రాజస్థాన్ రెవెన్యూ మంత్రిని ట్రాప్ చేయాలనే ఒత్తిడిని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. 


జోధ్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్‌కు ఎదురుగా ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్ ఏడో అంతస్థులో ఉంటున్న మోడల్  గత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. తన రూమ్ బాల్కనీ నుంచి కిందకు దూకి చనిపోయింది. ఆమె మరణం వెనుక హనీ ట్రాప్ గ్యాంగ్ ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది. అక్షత్, దీపిక అనే ఇద్దరు వ్యక్తులు రాజస్థాన్ రెవెన్యూ మంత్రి రామ్‌లాల్ జాట్‌ను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇద్దరు మోడళ్లను తీసుకుని గత గురువారం ఏదో పని అని చెప్పి మంత్రిని కలిశారు. అనంతరం అతను ఉంటున్న సర్క్యూట్ హౌస్‌కు ఎదురుగా ఉన్న హోటల్లో దిగారు. అమ్మాయిలను కూడా అదే హోటల్లో ఉంచారు. 


ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకమ్మాయి ఈ పనికి అంగీకరించలేదు. దాంతో ఆ అమ్మాయి నగ్నంగా ఉన్న వీడియోను చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి తీవ్ర మానసిక ఒత్తడికి గురైంది. ఆందోళన తట్టుకోలేక ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. దీపిక, అక్షత్‌లను ప్రధాన సూత్రధారులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. 


 

Updated Date - 2022-02-02T18:10:57+05:30 IST