జాతీయ స్థాయి పోటీలకు మరికల్‌ విద్యార్థిని ఎంపిక

ABN , First Publish Date - 2022-05-21T04:28:02+05:30 IST

జాతీయస్థాయి యోగా ఒలింపియాడ్‌ పోటీలకు మరికల్‌ విద్యార్థిని నందిని ఎంపికయ్యారు.

జాతీయ స్థాయి పోటీలకు మరికల్‌ విద్యార్థిని ఎంపిక
ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న నందిని

నారాయణపేట, మే 20: జాతీయస్థాయి యోగా ఒలింపియాడ్‌ పోటీలకు మరికల్‌ విద్యార్థిని నందిని ఎంపికయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎస్సీఈ ఆర్టీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి యోగా ఒలింపియాడ్‌ 2022పోటీలను నిర్వ హించారు. మరికల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నందిని ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా నందినితో పాటు ఆమె తల్లిదండ్రులు, యోగా శిబిరం నిర్వాహకులను డీఈవో లియాఖత్‌ అలీ అభినం దించారు. జాతీయస్థాయిలో కూడా రాణించాలని ఆక్షాంక్షించారు. 

Updated Date - 2022-05-21T04:28:02+05:30 IST