రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
ABN , First Publish Date - 2021-11-19T05:17:33+05:30 IST
కొండగుంపాంలో జిల్లా స్థాయి జూనియర్ కుస్తీ పోటీలు (అండర్-15, అండర్- 17, అండర్-20) గురువారం నిర్వహించారు.
నెల్లిమర్ల: కొండగుంపాంలో జిల్లా స్థాయి జూనియర్ కుస్తీ పోటీలు (అండర్-15, అండర్- 17, అండర్-20) గురువారం నిర్వహించారు. ఈ పోటీలు రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.వెంకటరమణ, కార్యదర్శి పతివాడ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారు లు ఈనెల 26, 27, 28 తేదీల్లో గుంటూ రులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు.
బొబ్బిలి రూరల్ : చింతాడ జడ్పీ ఉన్నతపాఠశాలలో గురువారం జిల్లా షూటింగ్బాల్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా జట్టును ఎంపిక చేశారు. జూనియర్, సీనియర్ విభాగంలో జట్టుకు 22 మంది చొప్పున స్ర్తీ, పురు షులను ఎంపిక చేసినట్లు పీడీ కృష్ణమూర్తి తెలిపా రు. వాతావరణ పరిస్థితు లను బట్టి రాష్ట్ర స్థాయి పోటీల షెడ్యూల్ను త్వర లో ప్రకటిస్తామని చెప్పా రు. జిల్లా జట్టుకు ఎంపి కైన క్రీడాకారులను పలు వురు అభినందించారు.