కొమురవెల్లిలో రేషన్బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-09-19T04:08:22+05:30 IST
కొమురవెల్లి మండలకేంద్రంలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని శనివారం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
చేర్యాల, సెప్టెంబరు 18: కొమురవెల్లి మండలకేంద్రంలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని శనివారం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కడమంచి యాదగిరి పలు గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్బియ్యం కొనుగోలుచేసి సిద్దిపేట, కామారెడ్డిలోని రైస్మిల్లర్లకు అధిక ధరకు విక్రయిస్తున్నాడని అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీ చేయడంతో అతడి ఇంట్లో 7టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. రేషన్ బియ్యం దందాకు ఎవరైనా పాల్పడితే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 7901100100కు సమాచారం అందించాలని టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్ కోరారు.