ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-06-30T05:12:23+05:30 IST

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన బంగారం

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 29: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బుధవారం కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడు లోదుస్తుల్లో 226 గ్రాముల బంగారం తెచ్చాడు. కస్టమ్స్‌ తనిఖీల్లో  లోదుస్తులు, మేకప్‌ కిట్టులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే  సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ బంగారాన్ని సీజ్‌ చేశారు. ఈ గోల్డ్‌ విలువ రూ.11.08లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-06-30T05:12:23+05:30 IST