30 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-01-20T07:07:43+05:30 IST

మండల కేంద్రంలోని దురాజ్‌పల్లి క్రాస్‌ రోడ్డులో 30 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..

30 కేజీల గంజాయి పట్టివేత

చివ్వెంల, జనవరి 19: మండల కేంద్రంలోని దురాజ్‌పల్లి క్రాస్‌ రోడ్డులో 30 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్‌పల్లి క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ.. ఓ లారీలో అనుమానాస్పదంగా ఉన్న మక్తల్‌ నారాయణపేట జిల్లా మంగనూర్‌ మండలానికి చెందిన శివలింగప్ప దంగర్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బిర్లాపూర్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ ఇస్తాక్‌, కర్ణాటక రాష్ట్రం బల్గంపూర్‌ జిల్లాకు చెందిన సంబేకర్‌ను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3 లక్షలు విలువైన 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 

 

Updated Date - 2022-01-20T07:07:43+05:30 IST