72 బస్తాల రేషన బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST

సోమందేపల్లి మండలం మేకలపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప అక్రమంగా రేషన బియ్యాన్ని తరలిస్తుండగా 72 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు.

72 బస్తాల రేషన బియ్యం స్వాధీనం
స్వాధీనం చేసుకున్న రేషన బియ్యాన్ని చూపుతున్న పోలీసులు

రొద్దం, ఏప్రిల్‌ 20: సోమందేపల్లి మండలం మేకలపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప అక్రమంగా రేషన బియ్యాన్ని తరలిస్తుండగా 72 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు. రొద్దం మండల పరిధిలోని చెరుకూరు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా టాటాయేస్‌ వాహనంలో అక్రమంగా పావగడకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వాహన యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టటబడిన బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రంలో ఏఎ్‌సఐ మనోహర్‌, శివ, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-04-20T05:30:00+05:30 IST