21 ప్యాకెట్ల చౌకధరల బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-06T06:34:07+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న 21 ప్యాకెట్ల చౌకధరల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అర్బనసీఐ కరుణాకర్‌ తెలిపారు.

21 ప్యాకెట్ల చౌకధరల బియ్యం స్వాధీనం

ధర్మవరం, ఆగస్టు5: అక్రమంగా తరలిస్తున్న 21 ప్యాకెట్ల చౌకధరల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అర్బనసీఐ కరుణాకర్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని శారదానగర్‌కు చెందిన బోగ రాజు నరసింహులు, దంపెట్ల పవన కల్యాణ్‌ బియ్యాన్ని  తరలిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో తాను సిబ్బం దితో గురువార తెల్లవారుజామున సబ్‌జైలు ఎదురుగా ఆర్టీసీబస్టాండ్‌కు వెళ్లే రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టాం. ఈ తనిఖీల్లో యాధవవీధి వైపు నుండి ఓ ఆటో రాగా తనిఖీ చేయగా అందులో బియ్యం ప్యాకెట్లను గుర్తించి వాటిని స్వాఽ దీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తే వారిపై కఠిన చర్యలు  తీసుకుంటామని సీఐ తెలిపారు. దీంతో డీఎస్పీ రమాకాంత సీఐ కరుణాకర్‌తోపాటు సిబ్బందిని అభినందించారు.


Updated Date - 2021-08-06T06:34:07+05:30 IST