up:సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై దేశద్రోహం కేసు

ABN , First Publish Date - 2021-08-18T18:03:54+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్, మరో ఇద్దరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు....

up:సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై దేశద్రోహం కేసు

లక్నో: తాలిబాన్లను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చినట్లు చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్, మరో ఇద్దరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.తాలిబాన్లను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చారని, వారి విజయాన్ని సంబరంగా జరుపుకున్నారని చంబల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చార్ఖేష్ మిశ్రా చెప్పారు.  ‘‘భారత ప్రభుత్వం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ. తాలిబాన్లపై చేసిన వ్యాఖ్యలు రాజద్రోహంగా పరిగణించవచ్చు. మేం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని ఎస్పీ మిశ్రా వీడియో ప్రకటనలో తెలిపారు. 


‘‘అఫ్ఘనిస్తాన్ స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను, వారు దేశాన్ని నడపాలనుకుంటున్నారు’’ అని సమాజ్‌వాది పార్టీకి చెందిన షఫీఖర్ బార్క్ విలేకరులతో వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తీవ్ర విమర్శలు చేశారు, కాబూల్ పతనం తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యతో ఎంపీ వ్యాఖ్యలను పోల్చారు.సమాజ్ వాదీ పార్టీలో ఏదైనా జరగవచ్చు. ‘‘జన గణ మన’’ పాడలేని వ్యక్తులు ఉన్నారు... ఎవరైనా తాలిబాన్లకు మద్దతు ఇవ్వవచ్చు, మరికొందరు ఉగ్రవాదులు పట్టుబడిన తర్వాత పోలీసులపై ఆరోపణలు చేయవచ్చు .’’అని కేశవ్ ప్రసాద్ ఆరోపించారు.


Updated Date - 2021-08-18T18:03:54+05:30 IST