AP News: చంద్రబాబుకు భద్రత పెంపు
ABN , First Publish Date - 2022-08-26T14:36:13+05:30 IST
Chittor: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం భద్రత
Chittor: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచారు. గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా.. నేటి నుంచి అదనంగా మరో 20 మందిని నియమించారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారు. కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. చంద్రబాబు పర్యటించిన గ్రామాల్లో టీడీపీ ఫ్లెక్సీలు వైసీపీ (YSRCP) కార్యకర్తలు తొలగించిన విషయం తెలిసిందే.