రెండో విడత సంస్థాగత ఎన్నికలపై ఓపీఎస్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-12-20T13:51:15+05:30 IST

అన్నాడీఎంకే రెండో విడత సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లపై ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం పార్టీ నేతలు, ప్రముఖులతో సమీక్షించారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఈనెల మూడున

రెండో విడత సంస్థాగత ఎన్నికలపై ఓపీఎస్‌ సమీక్ష

చెన్నై: అన్నాడీఎంకే రెండో విడత సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లపై ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం పార్టీ నేతలు, ప్రముఖులతో సమీక్షించారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఈనెల మూడున ప్రారంభమైంది. పార్టీ ఉపసమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్తగా పన్నీర్‌సెల్వం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మొదటి విడత సంస్థాగత ఎన్నికలు ఈనెల 13న ప్రారంభమై ఇటీవలే ముగిశాయి. ఈ నేపథ్యంలో 40 పార్టీ జిల్లా శాఖలకు సంబంధించిన రెండో విడత సంస్థాగత ఎన్నికలు ఈనెల 22 నుంచి 23 వరకు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఏర్పాట్లపై పన్నీర్‌సెల్వం ఆదివారం ఉదయం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’లో చెన్నై జిల్లాల శాఖల నాయకులతో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి పార్టీ  ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ అధ్యక్షత వహించారు. పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ వచ్చే యేడాది ఫిబ్రవరిలో కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించేందుకు జిల్లా శాఖ నాయకులు తీవ్రంగా పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి చెన్నై కార్పొరేషన్‌లో సగానికి పైగా వార్డులలో పార్టీ తప్పకుండా విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2021-12-20T13:51:15+05:30 IST