TamilNaduలో బీఏ4 ఒమైక్రాన్ సబ్ వేరియెంట్ రెండో కేసు

ABN , First Publish Date - 2022-05-21T17:49:00+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలో శనివారం ఒమైక్రాన్ బీఏ4 సబ్ వేరియంట్ రెండవ కేసు నమోదైంది....

TamilNaduలో బీఏ4 ఒమైక్రాన్ సబ్ వేరియెంట్ రెండో కేసు

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో శనివారం ఒమైక్రాన్ బీఏ4 సబ్ వేరియంట్ రెండవ కేసు నమోదైంది. చెంగల్‌పేట్ జిల్లా నవలూర్ గ్రామంలో ఒమైక్రాన్ బీఏ4 సబ్-వేరియంట్‌కు సంబంధించిన ఒక కేసు నమోదైందని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్ వెల్లడించారు. మే 20వతేదీ శుక్రవారం హైదరాబాద్‌లో ఒమైక్రాన్ బీఏ4 సబ్-వేరియంట్‌ మొదటి కేసు నమోదైంది.ఈ కొత్త వేరియంట్ సోకిన వ్యక్తి చెన్నైనుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్పట్టు జిల్లాలోని నవలూరు నివాసి.శుక్రవారం తెలంగాణలోని హైదరాబాద్‌లో బీఏ.4 సబ్ వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు నమోదైంది.దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన వ్యక్తికి ఈ కొత్త వేరియెంట్ సోకిందని తేలింది.


బీఏ 4 వేరియెంట్ మొదటి సారి ఈ ఏడాది జనవరి 10వతేదీన దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. ఈ కొత్త వేరియెంట్ సోకిన రోగుల్లో కరోనా లక్షణాలు అధికంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.భారతదేశంలో బీఏ 4 సబ్ వేరియెంట్ రెండు కేసులు నమోదవడం ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.


Updated Date - 2022-05-21T17:49:00+05:30 IST