సైన్స్ ఆవిష్కరణలతో అద్భుతాలు
ABN , First Publish Date - 2020-02-20T08:43:48+05:30 IST
సైన్స్ ఆవిష్కరణలతో అద్భుతాలు
కొంతలం (రోలుగుంట), ఫిబ్రవరి 19 : సమాజానికి మేలు కలిగించేలా సైన్స్ ఆవిష్కరణలు ఉండాలని, భవిష్యత్లో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) శాస్త్రవేత్త మడ్డు వెంక టసత్యనారాయణ అన్నారు. మండలంలోని కొంతల జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ భావి ప్రపంచాన్ని శాసించేది సైన్స్ మాత్రమేనన్నారు. సృజనాత్మకత ఉంటే విద్యార్థులు మంచి శాస్త్ర వేత్తలు కాగలరన్నారు. ఒత్తిడి లేకుండా, బట్టీ పట్టకుండా ప్రస్తుత విషయానికే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఏదైనా సాధ్యమవు తుందని చెప్పారు.
స్థానిక సమస్యలను గుర్తించి అన్వేషణ దృష్టితో పరిష్కారాన్ని కనుగొనడమే నూతన ఆవిష్కరణలని పేర్కొన్నారు. అనంతరం విద్యా ర్థులు తయారు చేసిన పొక్లైనర్ నమూనా, రోబోటిక్స్, సూక్ష్మ సేద్యం, విద్యుత్ వాహనాలు తదితర అరవై నమూనాలను తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయం సూపరిండెంట్ చంద్రశేఖర్, హెచ్ఎం బీవీ రమణ, సైన్సు ఉపాధ్యాయులు రాఘవనాయుడు, కిరణ్, నానిబాబు తదితరులు తదితరులు పాల్గొన్నారు.