స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ABN , First Publish Date - 2020-08-08T10:04:23+05:30 IST

ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ..

స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

 ఉద్యోగుల నిరసన


నెల్లూరు (వైద్యం), ఆగస్టు 7: ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నెల్లూరులోని జనార్దన్‌రెడ్డి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలల్లోకి తీసుకెళ్లటానికి స్కీం వర్కర్లు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వర్తింప చేయాలని కోరారు. కరోనా నేపథ్యంలో వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌,  శ్రామిక మహిళా విభాగం నగర కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌బీ, పద్మ, శ్రీదేవి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T10:04:23+05:30 IST