సాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన ఎస్సీ

ABN , First Publish Date - 2021-04-16T07:24:03+05:30 IST

మండలంలో లెఫ్ట్‌ పోచంపాడ్‌గ్రామం వద్ద ఎస్సా రెస్పీ ప్రాజెక్టును మిషన్‌భగీరథ ఎస్సీ వెంకటేశ్వర్‌రావు గురువారం సా యంత్రం పరిశీలించారు.

సాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన ఎస్సీ
వివరాలు తెలుసుకుంటున్న భగీరథ ఎస్సీ

సోన్‌, ఏప్రిల్‌ 15 : మండలంలో లెఫ్ట్‌ పోచంపాడ్‌గ్రామం వద్ద ఎస్సా రెస్పీ ప్రాజెక్టును మిషన్‌భగీరథ ఎస్సీ వెంకటేశ్వర్‌రావు గురువారం సా యంత్రం పరిశీలించారు. గ్రామం వద్ద నుండి ఎస్సారెస్పీ నుండి సరస్వతి కాలువకు సాగునీరు, మిషన్‌ భగీరథకు నీరు సరఫరా చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా నీటిసరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పరిశీలించి వి వరాలు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా పూర్తిస్థాయి మరమ్మతులకు సన్నాహలు చేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట ఎస్సారెస్పీ ఈఈ రామారావ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణ ప్రసాద్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలపార్టీ అధ్యక్షుడు మోహినోద్దీన్‌, నాయకులు రాంకిషన్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-04-16T07:24:03+05:30 IST