నీటి వనరుల సద్వినియోగంపై అవగాహన

ABN , First Publish Date - 2020-11-29T05:56:55+05:30 IST

చినదొడ్డిగల్లులోని పలు చెరువుల కింద ఉన్న ఆయకట్టుదారులకు భూగర్భజలాలు, సాగునీటి వనరుల సద్వినియోగంపై భూగర్భ జలశాఖ (విజయవాడ) డిప్యూటీ డైరెక్టర్‌ పి.కోదండరావు శనివారం అవగాహన కల్పించారు.

నీటి వనరుల సద్వినియోగంపై అవగాహన
చినదొడ్డిగల్లులో రైతులకు అవగాహన కల్పిస్తున్న డీడీ కోదండరావు

నక్కపల్లి, నవంబరు 28 : చినదొడ్డిగల్లులోని పలు చెరువుల కింద ఉన్న ఆయకట్టుదారులకు భూగర్భజలాలు, సాగునీటి వనరుల సద్వినియోగంపై భూగర్భ జలశాఖ (విజయవాడ) డిప్యూటీ డైరెక్టర్‌ పి.కోదండరావు శనివారం అవగాహన కల్పించారు. భూగర్భజలాలను రైతులు ఎలా సద్వినియోగపర్చుకుని సిరులు పండించ వచ్చునో వివరించారు. అనంతరం పలు చెరువుల కింద ఉన్న బోర్ల పనితీరును పరిశీలించారు. భూగర్భ జలశాఖ జిల్లా అధికారి నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ చెరువుల పరిధిలో ఉన్న బోర్లను జియో ట్యాగ్‌ చేశామని చె ప్పారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావు, ఏపీవో కె.రమేశ్‌బాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వెలగా ఈశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు వెలగా వెంకట్రావ్‌, గట్టెం వీరరాఘవరావు , గట్టెం నానాజీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:56:55+05:30 IST