గెలుపే ధ్యేయంగా పనిచేయాలి: బీసీ

ABN , First Publish Date - 2021-01-27T06:16:43+05:30 IST

సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే ధ్యాయంగా పనిచేయాలని టీడీపీ కార్య కర్తలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

గెలుపే ధ్యేయంగా పనిచేయాలి: బీసీ

బనగానపల్లె, జనవరి 26: సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే ధ్యాయంగా పనిచేయాలని టీడీపీ కార్య కర్తలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు 24 గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. గెలిచే అభ్యర్థులను రంగంలో దించేందుకు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ముమ్మరంగా చర్చలు సాగించారు. వైసీపీ అభ్యర్థులను  దీటుగా ఎదుర్కొగల వ్యూహంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి గెలిచారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌ కార్డులను తీసివేస్తూ, పెట్రోల్‌, డీజల్‌ ధరలు విపరీతంగా పెంచే స్తున్నారన్నారు. ఇసుక కొరతతో ప్రజలు నిత్యం అల్లాడుతున్నా వైపీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ బలపరుస్తున్న అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని  అన్నారు. 

Updated Date - 2021-01-27T06:16:43+05:30 IST