నా ఆస్తులమ్మి phc ఏర్పాటు చేస్తా!

ABN , First Publish Date - 2021-10-21T16:34:24+05:30 IST

ప్రజలకు సకాలంలో వైద్య చికిత్సలు అందించేలా తన ఆస్తులు అమ్మి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తానని నూతన పంచాయతీ అధ్యక్షుడు శపథం చేశారు. అరియలూరు జిల్లా జయంకొండాం సమీపంలోని నాయకనైప్రి

నా ఆస్తులమ్మి phc ఏర్పాటు చేస్తా!

                          - నూతన పంచాయతీ అధ్యక్షుడి శపథం


పెరంబూర్‌(chennai): ప్రజలకు సకాలంలో వైద్య చికిత్సలు అందించేలా తన ఆస్తులు అమ్మి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తానని నూతన పంచాయతీ అధ్యక్షుడు శపథం చేశారు. అరియలూరు జిల్లా జయంకొండాం సమీపంలోని నాయకనైప్రియాల్‌ గ్రామ పంచాయతీ అధ్యక్ష పదవికి జరిగిన ఉప ఎన్నికల్లో రాజారామన్‌ 206 ఓట్లతో గెలుపొందారు. ఆయన పదవీప్రమాణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా రాజారామన్‌ మాట్లాడుతూ, తన ఆస్తులమ్మి తిరుజ్ఞానం పడయాచ్చి స్మారకార్థం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తానని, అందుకు ఎన్ని లక్షలు ఖర్చయినా భరిస్తానని, ఈ ప్రాంత ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్యచికిత్సలు అందించడమే లక్ష్యమని రాజారామన్‌ తెలిపారు.

Updated Date - 2021-10-21T16:34:24+05:30 IST