ఆర్థిక పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల అమలు
ABN , First Publish Date - 2021-07-25T02:59:03+05:30 IST
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా సీఎం జగన్మోహన్రెడ్డి క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కాకాణి
ముత్తుకూరు, జూలై 24: రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా సీఎం జగన్మోహన్రెడ్డి క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరులోని వెలుగు కార్యాలయంలో శనివారం ఆయన మధ్యాహ్న భోజన కార్మికులకు, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.6 లక్షల విలువైన నిత్యావసరాలు అందించడం అభినందనీయమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మొదటి విడతలో 3.5కోట్ల విలువైన బియ్యం, వంటనూనె ఉచితంగా అందజేశామని, రెండో విడతలో ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేశామన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై అధికారులతో చర్చించారు. గ్రామాల వారీగా రెవెన్యూ పరమైన సమస్యలను తెలుసుకొని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్థన్రెడ్డి, నాయకులు కాకుటూరు లక్ష్మణరెడ్డి, నెల్లూరు శివప్రసాద్, గండవరపు సుగుణ, పోలిరెడ్డి చిన్నపరెడ్డి, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ సోమయ్య, తహసీల్దారు సోమ్లానాయక్, ఎంపీడీవో ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.