శంకరయ్య సేఫ్
ABN , First Publish Date - 2022-07-04T05:57:29+05:30 IST
ముంబైలో కిడ్నాప్కు గురైన ముత్తమల్ల శంకర య్యను పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి రక్షించినట్లుగా తె లుస్తోంది.
12 రోజులకు కిడ్నాపర్ల చెర నుంచి విడిపించిన పోలీసులు
పెగడపల్లి, జులై 3 : ముంబైలో కిడ్నాప్కు గురైన ముత్తమల్ల శంకర య్యను పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి రక్షించినట్లుగా తె లుస్తోంది. పెగడపల్లి మండలం నం దగిరి గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 22న ముంబై ఏర్పోర్టులో కిడ్నాప్నకు గురయ్యాడు. ఏర్ పోర్టు లో దిగి బస్సులో ఇంటికి వస్తున్నా న ని చెప్పిన శంకరయ్య మూడు రోజు లకు కిడ్నాపైనట్లు సమాచారం రావ డంతో కుటుంబ సభ్యులు ఆందోళన కు గురయ్యారు. శంకరయ్య కుటుంబ సభ్యులు ముంబై వెళ్లి అక్కడి పో లీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు ముంబై పోలీసులు తమిళనాడు, పాండిచ్చేరి తదితర ప్రాంతాలలో గాలించగా శనివారం రాత్రి పాండిచ్చేరి లో కిడ్నాపర్ల చెరలోనున్న శంకరయ్యను విడిపించి ఆదివారం మధ్యా హ్నం ముంబైకి తరలించినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు మాత్రం శం కరయ్య ఆచూకీ లభించలేదని అంటున్నారు. శంకరయ్య ముంబై చేరకు న్నాడని విచారణ అనంతరం నేడో రేపో ఇంటికి చేరనున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.