ప్రాణాలు పణంగా సేవలందించిన పారిశుధ్య కార్మికులు

ABN , First Publish Date - 2021-10-28T06:18:06+05:30 IST

కరోనా ఆపత్కాలంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలు పణంగా సేవలు అందించారని భూదాన్‌పోచంపల్లి మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌ అన్నారు.

ప్రాణాలు పణంగా సేవలందించిన పారిశుధ్య కార్మికులు
భూదాన్‌పోచంపల్లిలో మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులకు దుస్తులు అందజేస్తున్న చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌

భూదాన్‌ పోచంపల్లి, అక్టోబరు 27: కరోనా ఆపత్కాలంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలు పణంగా సేవలు అందించారని భూదాన్‌పోచంపల్లి మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌ అన్నారు. విదేశాల్లో ఉంటున్న ఈ దంప తుల కుమారుడు క్రాంతికుమార్‌ పుట్టినరోజు సందర్భంగా భూదాన్‌పోచం పల్లి లోని 60 మంది పారిశుధ్య కార్మికులకు చీరలు, పంచెలు దానం చేసి మాట్లా డారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామియాదవ్‌, కమిషనర్‌ ఎన్నం సుదర్శన్‌, కౌన్సిలర్లు కర్నాటి రవీందర్‌, గుండు మధు, పెద్దల చక్రపాణి, సామల మల్లారెడ్డి, దేవరాయకుమార్‌, కుడికాల అఖిల బలరాం పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T06:18:06+05:30 IST