ప్రాణాలు పణంగా సేవలందించిన పారిశుధ్య కార్మికులు
ABN , First Publish Date - 2021-10-28T06:18:06+05:30 IST
కరోనా ఆపత్కాలంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలు పణంగా సేవలు అందించారని భూదాన్పోచంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్ అన్నారు.
భూదాన్ పోచంపల్లి, అక్టోబరు 27: కరోనా ఆపత్కాలంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలు పణంగా సేవలు అందించారని భూదాన్పోచంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్ అన్నారు. విదేశాల్లో ఉంటున్న ఈ దంప తుల కుమారుడు క్రాంతికుమార్ పుట్టినరోజు సందర్భంగా భూదాన్పోచం పల్లి లోని 60 మంది పారిశుధ్య కార్మికులకు చీరలు, పంచెలు దానం చేసి మాట్లా డారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామియాదవ్, కమిషనర్ ఎన్నం సుదర్శన్, కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, గుండు మధు, పెద్దల చక్రపాణి, సామల మల్లారెడ్డి, దేవరాయకుమార్, కుడికాల అఖిల బలరాం పాల్గొన్నారు.