ఏకాంతసేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-17T06:01:25+05:30 IST

సంగం పెన్నానది ఒడ్డున వెలసిన కామాక్షీదేవి సమేత సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ఏకాం తసేవతో ముగిశాయి.

ఏకాంతసేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఏకాంతసేవలో సంగమేశ్వరుడు

సంగం, ఏప్రిల్‌ 16: సంగం పెన్నానది ఒడ్డున వెలసిన కామాక్షీదేవి సమేత సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ఏకాం తసేవతో ముగిశాయి. రాత్రి కామాక్షితాయి ఒక్కరే గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పుట్టింటి సాంప్రదాయానుసారంగా నై వేధ్యంలో చీర, సారెలు పెట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకున్న అమ్మవారికి పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తుండగా ఊంజల్‌ సేవ నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ ప్రతిని ధులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాలకు సహకరించి న అందరికీ ఈవో వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-04-17T06:01:25+05:30 IST