ఇసుక లారీ సీజ్
ABN , First Publish Date - 2021-02-26T06:26:09+05:30 IST
రాజమహేంద్ర వరం రూరల్ మండలం కాతేరు శివారు ములకల్లంక రేవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను స్పెషల్ ఎన్ఫొర్సుమెంట్ బ్యూరో సిబ్బంది పట్టుకున్నారు.
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 25:రాజమహేంద్ర వరం రూరల్ మండలం కాతేరు శివారు ములకల్లంక రేవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను స్పెషల్ ఎన్ఫొర్సుమెంట్ బ్యూరో సిబ్బంది పట్టుకున్నారు. బుధవా రం రాత్రి ములకల్లంక నుంచి వస్తున్న ఇసుక లారీని స్ఫెషల్ ఎన్ఫొర్సుమెంట్ బ్యూరో సిబ్బంది కాతేరు శివారులో తనిఖీ చేసింది. అయితే ఆ లారీ డ్రైవర్ దానికి సంబంధించి బిల్లును చూపించాడు. ఆ బిల్లు నకిలీదని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని లారీని సీజ్చేసి త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.