కొత్త మోడల్లో Samsung గెలాక్సీ స్మార్ట్ఫోన్..
ABN , First Publish Date - 2021-07-22T00:41:19+05:30 IST
కొత్త మోడల్లో Samsung గెలాక్సీ స్మార్ట్ఫోన్..
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శాంసంగ్ సంస్థ పేర్కొంది. భారత మార్కెట్లో జూలై 23న శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. 6జీబీ ర్యామ్తోపాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ఫోన్ రూ. 19,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. గత నెలలో యూరోపియన్ మార్కెట్లో గెలాక్సీ ఏ22 4జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది.