ప్రారంభమైన సమ్మక్క-సారలమ్మ జాతర
ABN , First Publish Date - 2021-02-25T06:16:32+05:30 IST
నిర్మల్జిల్లా ముథోల్ మండలంలోని ఎడ్బిడ్ తండాలోని గుట్టలో వెలసిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది,
మొదటి రోజుమొక్కులు తీర్చుకున్న భక్తులు
బోనం ఎత్తిన ముస్లిం భక్తురాలు
ముథోల్, ఫిబ్రవరి 24 : నిర్మల్జిల్లా ముథోల్ మండలంలోని ఎడ్బిడ్ తండాలోని గుట్టలో వెలసిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది, దేవాలయ పూజారి జాదవ్ రేణుకమ్మ, దేవాలయ ధర్మకర్త జాదవ్ సతీష్లు భాజాభజంత్రీల మధ్య ఎడ్బిడ్ తండా నుంబొ రాజేష్ తండాలో వెలసిన సారలమ్మకు భోనాలు తీసుకువెళ్లారు. కనకవనంను తీసుకవచ్చారు. ఆనంతరం సారలమ్మ, సమ్మక్క గద్దెల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది, భక్తులు ఉమ్మడి అదిలాబాధ్ జిల్లా నుండి కాకుండా మహారాష్ట్ర నుండి సైతం భక్తు లు తరలివచ్చి వనదేవతలకు భక్తి శ్రధ్దలతో మొక్కులను తీర్చుకున్నారు. మొక్కిన మొక్కులు నెరవేరాలని నిలువెత్తు(బంగారం)ను అమ్మవారికి సమర్పించారు.
మరికొందరూ మేకలను బలిఇచ్చారు. ఈ జాతర నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచే ఆయా ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భం గా పలువురు శివసత్తులు పూనకంతో ఊగారు. ఇది ఇలా ఉండగా మొ క్కిన ముక్కులు తీర్చే వనదేవతను కుంటాల మండలంకు చెందిన ముస్లిం మహిళా భక్తురాలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆ భక్తురాలు భోనమెత్తి వనదేవతలకు సమర్పించారు. ఈ సమ్మక్క సారలమ్మలకు నేను మొక్కిన మొక్కులు తీరడంతో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినట్లు తెలిపారు.