‘ఎండీయూ ఆపరేటర్‌పై వలంటీర్ల దౌర్జన్యం’

ABN , First Publish Date - 2021-02-26T05:42:05+05:30 IST

సామర్లకోట, ఫిబ్రవరి 25: మండలంలోని హుస్సేన్‌పురంలో రేషన్‌ సరుకులు సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్‌ పలివెల అంజిపై వేట్లపాలేనికి చెందిన వలంటీరు తోట శివ, మరి కొందరు వలంటీర్లు దౌర్జన్యం చేసి తీవ్రంగా గాయపరిచారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మండలం

‘ఎండీయూ ఆపరేటర్‌పై వలంటీర్ల దౌర్జన్యం’

సామర్లకోట, ఫిబ్రవరి 25: మండలంలోని హుస్సేన్‌పురంలో రేషన్‌ సరుకులు సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్‌ పలివెల అంజిపై వేట్లపాలేనికి చెందిన వలంటీరు తోట శివ, మరి కొందరు వలంటీర్లు దౌర్జన్యం చేసి తీవ్రంగా గాయపరిచారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని 18 మంది ఆపరేటర్లు సామర్లకోట తహశీల్దార్‌ వజ్రపు జితేంద్రకు గురువారం ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే వలంటీర్లు తమపై దాడి చేశారని ఆరోపించారు. ఎండీయూ ఆపరేటర్లకు వ్యక్తిగత భద్రత కల్పించాలని సంఘ నాయకులు పి.అంజియ్య, ఎం.శ్రీను, సీహెచ్‌ అప్పారావు, డి.సత్తిబాబు, డి.సత్యానందం, ఎల్‌.బాలకృష్ణ, మంగరాజు వినతిపత్రం ఇచ్చారు. దాడులు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, రేషన్‌ సరుకుల పంపిణీని కొనసాగించాలని తహశీల్దార్‌ ఆదేశించారు.

Updated Date - 2021-02-26T05:42:05+05:30 IST