సైదాపురం తహసీల్దారు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-09-27T18:03:54+05:30 IST

సైదాపురం తహ సీల్దారుగా పనిచేస్తున్న కె.శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ..

సైదాపురం తహసీల్దారు సస్పెన్షన్‌

సైదాపురం/బాలాయపల్లి: సైదాపురం తహ సీల్దారుగా పనిచేస్తున్న కె.శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ  జిల్లా కలె క్టర్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన బాలాయపల్లి మం డల తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో, ఓ వ్యక్తి మండలం లోని అలిమిలి పంచాయతీ పరిధిలో గల కనుమరాయకొండలో ఎంతమందికి ఇచ్చారనే సమాచారాన్ని సమాచారహక్కు చట్టం కింద అడిగాడు. అయితే ఒరిజినల్‌ రికార్డులు చూడకుండా సమాచారం ఇచ్చినందుకు సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. అయితే కె.శ్రీని వాసు లుకు ముందున్న తహసీల్దారు కనుమరాయకొండను ఓ వ్యక్తి పేరున రికార్డుల్లో నమోదు చేశారని, ఆసమాచారాన్ని ఇవ్వడం వల్లే సస్పెండ్‌ చేశారని తెలుస్తున్నది.


Updated Date - 2020-09-27T18:03:54+05:30 IST