అశ్రునయనాల మధ్య సాయితేజ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-12-12T21:32:20+05:30 IST

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి.

అశ్రునయనాల మధ్య సాయితేజ అంత్యక్రియలు

చిత్తూరు జిల్లా: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. పోలీసులు, సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సాయితేజ అంత్యక్రియాలకు బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. తీవ్ర విచార వదనాలతో సాయితేజకు వీడ్కోలు పలికారు. 


అంతకుముందు ఆదివారం ఉదయం జవాన్ సాయితేజ భౌతికకాయం బెంగుళూరు ఎయిర్ బేస్ నుంచి స్వగ్రామానికి బయలుదేరింది. ఆంధ్రా-కర్నాటక సరిహద్దు నుంచి సాయితేజ పార్ధివదేహానికి నివాళి అర్పిస్తూ యువత బైక్ ర్యాలీ చేపట్టింది. ‘జై జవాన్ అమర్ రహే సాయితేజ’ అంటూ యువత నినాదాలతో మదనపల్లె ప్రాంతం మారుమ్రోగింది. అలాగే జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారత మాతాకు జై అంటూ దేశ భక్తిని చాటుకున్నారు. ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరులైన వీర జవాన్లకు దేశం కన్నీటి నివాళి అర్పిస్తోంది. 

Updated Date - 2021-12-12T21:32:20+05:30 IST