భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-03-05T06:39:35+05:30 IST

కర్మాగారాల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సింహాద్రి జీజీఎం దివాకర్‌ కౌశిక్‌ సూచించారు.

భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్టీపీసీ అధికారులు

సింహాద్రి జీజీఎం దివాకర్‌ కౌశిక్‌

పరవాడ, మార్చి 4: కర్మాగారాల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సింహాద్రి జీజీఎం దివాకర్‌ కౌశిక్‌ సూచించారు. 50వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలను సింహాద్రి ఎన్టీపీసీకి చెందిన దీపాంజలినగర్‌లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారానే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ముఖ్య తనిఖీ అధికారి జె.శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. భధ్రత పట్ల కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. దీపాంజలినగర్‌లో ర్యాలీ నిర్వహించారు. అలాగే భద్రత గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి వివిధ విభాగాల జీఎంలు ఏసీ చౌక్సే, ఆర్‌కె సాహా, శుభాష్‌ గార్గ్‌, ఎంఎన్‌వీఎస్‌ భాస్కర్‌, సింహాద్రి ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-05T06:39:35+05:30 IST